వార్తలకు తిరిగి వెళ్లండి

నీట్ పీజీ ప్రవేశ పరీక్షకు సిద్ధమవుతున్న యశ్విత(26) హైదరాబాద్లోని ప్రైవేటు వసతిగృహంలో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. కర్నూలుకు చెందిన ఆమె ఎంబీబీఎస్ పూర్తి చేసి ఆరు నెలలుగా ఆర్టీసీ క్రాస్రోడ్డులో ఉంటూ పరీక్షకు సిద్ధమవుతోంది.
శనివారం ఉదయం తండ్రితో మాట్లాడిన ఆమె ఆ తర్వాత ఫోన్కు స్పందించలేదు. హాస్టల్ నిర్వాహకులు పరిశీలించగా ఆమె అచేతనంగా కనిపించింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Loading comments...

