వార్తలకు తిరిగి వెళ్లండి

పల్నాడు జిల్లా రెంటచింతలలో వైసీపీ నాయకుడు నవులూరి చెన్నారెడ్డి (35) దారుణ హత్యకు గురయ్యారు. గుర్తుతెలియని దుండగులు గొంతు కోసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.
రెంటచింతల–రెంటాల మార్గంలోని పులోళ్ల బావి సమీపంలో ఘటన జరిగింది. పోలీసులు మృతదేహాన్ని గురజాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి హత్యకు గల కారణాలు, నిందితుల కోసం దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

