Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆరు రోజుల తర్వాత యాత్ర

భవేష్ కుమార్ Jul 25, 2026 9:15 AM అల్ ఇండియా about 3 hours ago
ఆరు రోజుల తర్వాత యాత్ర - Udayam Digital
భారీ వర్షాలు, ప్రతికూల వాతావరణం కారణంగా ఆరు రోజులుగా నిలిచిపోయిన అమర్‌నాథ్ వార్షిక యాత్ర శనివారం తిరిగి ప్రారంభమైంది. జమ్ము నుంచి బాల్తాల్ బేస్ క్యాంప్‌కు కొత్త బృందం బయలుదేరింది. 1,470 మంది మహిళలు, 25 మంది పిల్లలు, 54 మంది సాధువులతో కలిపి 6,269 మంది యాత్రికులు 223 వాహనాల్లో కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రయాణం ప్రారంభించారు. పహల్గామ్ మార్గంలో కాన్వాయ్ పంపలేదని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...