Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలకు శ్రీలంక సిరీస్ కీలకం

Follow Udayam Digital on Google
అశ్విని దేవి Aug 07, 2026 12:24 PM ఆల్ ఇండియా క్రీడలు
డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలకు శ్రీలంక సిరీస్ కీలకం - Udayam Digital
ఆగస్టు 15 నుంచి శ్రీలంకతో జరిగే రెండు టెస్టుల సిరీస్ భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలకు కీలకంగా మారింది. ప్రస్తుతం 48.15 పీసీటితో ఐదో స్థానంలో ఉన్న భారత్ 2-0తో గెలిస్తే 57.58 పీసీటీకి చేరినా స్థానం మారదు. సిరీస్ 1-1తో ముగిస్తే భారత్ ఐదో స్థానంలోనే ఉంటుంది. అయితే 0-2తో ఓడితే పీసీటీ 39.39కు పడిపోగా, శ్రీలంక నాలుగో స్థానానికి ఎగబాకుతుంది. దీంతో భారత్‌కు ముందున్న సిరీస్‌లు మరింత కీలకంగా మారనున్నాయి.

Comments

G
Loading comments...