వార్తలకు తిరిగి వెళ్లండి
నారీ శక్తికి నిదర్శనం 'సముద్ర ప్రదక్షిణ': రాజ్నాథ్

త్రివిధ దళాల మహిళా అధికారుల 'సముద్ర ప్రదక్షిణ' యాత్రను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందించారు. తొమ్మిది మంది అధికారులు 'ఐఏఎస్వీ త్రివేణి' నౌక ద్వారా 314 రోజుల్లో 25,000 నాటికల్ మైళ్ల ప్రయాణం పూర్తి చేసి ముంబై చేరుకున్నారు.
ఈ విజయం భారత నారీ శక్తికి, త్రివిధ దళాల ఐక్యతకు నిదర్శనమని రాజ్నాథ్ అన్నారు. త్రివేణి నౌక ఆత్మనిర్భర్ భారత్కు ప్రతిరూపమని పేర్కొన్నారు.
Comments
Loading comments...