వార్తలకు తిరిగి వెళ్లండి

చేర్యాల మండలం ఆకునూరుకు చెందిన బత్తుల పద్మ (55) పాము కాటుకు గురై చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ నెల 8న వ్యవసాయ పనులు చేస్తుండగా పాము కాటేయడంతో కుటుంబ సభ్యులు సిద్దిపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
అక్కడ చికిత్స పొందుతూ ఆమె గురువారం రాత్రి మృతి చెందారు. ఆమెకు భర్త, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. పద్మ మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
Comments
Loading comments...

