వార్తలకు తిరిగి వెళ్లండి

గుడిహత్నూర్ మండలం తోషం గ్రామంలో ఇంటిని శుభ్రం చేస్తుండగా పాముకాటుకు గురైన ముడిమడుగుల రాజ్యలక్ష్మి (53) చికిత్స పొందుతూ మృతి చెందింది. గురువారం ఉదయం ఎడమ కాలికి పాము కాటేయడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
చికిత్స అందించినప్పటికీ పరిస్థితి విషమించడంతో గురువారం సాయంత్రం రాజ్యలక్ష్మి మృతి చెందింది.
Comments
Loading comments...

