వార్తలకు తిరిగి వెళ్లండి

వైకాపా ప్రభుత్వ హయాంలో పాడా కింద చేపట్టిన అభివృద్ధి పనులపై విజిలెన్స్ అధికారులు తనిఖీలు ప్రారంభించారు. పులివెందులలో మినీ సచివాలయంతో పాటు పలు పనులను పరిశీలించి వివరాలు నమోదు చేశారు.
ఏడు మండలాల్లో రూ.640 కోట్లతో చేపట్టిన పనులను దశలవారీగా తనిఖీ చేయనున్నారు. గతంలో సీసీ రోడ్ల పనుల్లో అవకతవకలు గుర్తించిన నేపథ్యంలో తాజా తనిఖీలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
Comments
Loading comments...
