వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తర్ప్రదేశ్లో ప్రియుడి సహాయంతో భర్తను హతమార్చిన ఘటన వెలుగులోకి వచ్చింది. బాగ్పత్కు చెందిన రచన, ఇన్స్టాగ్రామ్ ప్రియుడు సోనుతో కలిసి భర్త సచిన్ డాగర్ను నిద్రమాత్రలు ఇచ్చి గొంతు నులిమి చంపింది.
భర్త అనారోగ్యంతో చనిపోయాడని నమ్మించేందుకు ప్రయత్నించగా, మెడపై గుర్తులను చూసి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ దృశ్యాలతో నిందితులను పట్టుకున్న పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

