వార్తలకు తిరిగి వెళ్లండి
భర్తను చంపిన భార్య అరెస్ట్

చీరలు తీసుకురాలేదనే వివాదంలో భర్తను కుక్కర్ మూతతో కొట్టి, గొంతు నులిమి చంపిన 30 ఏళ్ల మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని బద్లాపూర్లో ఈ ఘటన జరిగింది. ప్రమాదవశాత్తు జరిగిందని సదరు మహిళ తొలుత పోలీసులను తప్పుదోవ పట్టించింది.
పోస్టుమార్టం రిపోర్టులో హత్య అని తేలడంతో విచారణ చేపట్టిన పోలీసులు సునీతాదేవిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు
Comments
Loading comments...