వార్తలకు తిరిగి వెళ్లండి
తాడిపూడి ఎత్తిపోతల నుంచి సాగునీరు విడుదల

తాడిపూడి ఎత్తిపోతల పథకం నుంచి జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు బుధవారం సాగునీటిని విడుదల చేశారు. కొవ్వూరు, గోపాలపురం ఎమ్మెల్యేలతో కలిసి ఆయన గోదావరి నదికి ప్రత్యేక పూజలు, హారతి నిర్వహించిన అనంతరం మోటార్ స్విచ్ ఆన్ చేసి నీటిని విడుదల చేశారు.
ఈ సందర్భంగా పథకం పనితీరుపై అధికారులతో సమీక్షించిన మంత్రి, సాగునీటి సరఫరాపై పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, జలవనరుల శాఖ అధికారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...