Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చీకటి ముసుగులో గ్రానైట్ అక్రమ రవాణా

స్వాతి రెడ్డి Jul 08, 2026 6:34 AM చిత్తూరు 2 viewsabout 2 hours ago
చీకటి ముసుగులో గ్రానైట్ అక్రమ రవాణా - Udayam Digital
చిత్తూరు జిల్లాలోని యాదమరి, బంగారుపాళ్యం, కుప్పం తదితర ప్రాంతాల్లో గ్రానైట్ అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. పది పర్మిట్లతో వందలాది గ్రానైట్ లోడ్లను రాత్రి వేళల్లో సరిహద్దులు దాటిస్తున్నారు. ప్రైవేటు సంస్థల తనిఖీలు నిలిచిపోవడం, గనుల శాఖలో పర్యవేక్షణ లోపించడం అక్రమార్కులకు వరంగా మారింది. నిఘా కెమెరాలు, పోలీసు స్టేషన్లు ఉన్నప్పటికీ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పాటు స్థానిక నాయకుల అండదండలతో ప్రభుత్వ రాబడికి తీవ్ర గండిపడుతోంది.

Comments

G
Loading comments...