వార్తలకు తిరిగి వెళ్లండి
మట్టి మాఫియా చేతిలో చిక్కుకున్న చెరువులు

ఉచిత పూడిక మట్టి వెసులుబాటును ఆసరాగా చేసుకుని మదనపల్లె, రామసముద్రం, నిమ్మనపల్లె ప్రాంతాల్లో దళారులు అక్రమ మట్టి దందా సాగిస్తున్నారు. రైతుల పేరుతో స్వల్ప అనుమతులు పొంది, నిబంధనలకు విరుద్ధంగా వందలాది టిప్పర్ల మట్టిని రియల్ ఎస్టేట్ లేఅవుట్లు, ఇటుక బట్టీలకు తరలిస్తూ రూ.లక్షలు ఆర్జిస్తున్నారు.
అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ ఆదాయానికి గండి పడటంతో పాటు చెరువుల ఉనికి ప్రమాదంలో పడుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...