వార్తలకు తిరిగి వెళ్లండి
నీటి విడుదల కోసం మహాధర్నా

కన్నెపల్లి పంపు హౌస్ నుంచి నీటిని ఎత్తిపోయాలని డిమాండ్ చేస్తూ, యాదాద్రి కలెక్టరేట్ ఎదుట బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ మహాధర్నా జరిగింది. కాంగ్రెస్ అసమర్థ పాలన వల్లే రైతులు ఇబ్బంది పడుతున్నారని ఆరోపిస్తూ పార్టీ శ్రేణులు నినాదాలతో హోరెత్తించాయి.
ఈ నిరసనలో మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, పైళ్ల శేఖర్ రెడ్డి, బూడిద బిక్షమయ్య గౌడ్ తదితర నాయకులు పాల్గొన్నారు. తక్షణమే నీటిని ఎత్తిపోసి రైతులను ఆదుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...