వార్తలకు తిరిగి వెళ్లండి
వృద్ధ దంపతులకు తీవ్ర గాయాలు

మెదక్ జిల్లా నర్సాపూర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్ధ దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. వారు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. డ్రైవర్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది.
ప్రమాదాన్ని గమనించిన ఫ్యాక్స్ ఛైర్మన్ రాజు యాదవ్, వెంటనే స్పందించి వారిని నర్సాపూర్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం క్షతగాత్రులను హైదరాబాద్కు తరలించారు.
Comments
Loading comments...