వార్తలకు తిరిగి వెళ్లండి
తాలిపేరుకు పోటెత్తిన వరద

తాలిపేరు ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. శుక్రవారం నాటికి ప్రాజెక్టులో నీటిమట్టం 72 మీటర్లకు (పూర్తిస్థాయి 74 మీటర్లు) చేరుకుంది. మరో రెండు మీటర్ల నీరు రాగానే కాల్వల ద్వారా సాగునీటిని విడుదల చేయనున్నారు.
ప్రాజెక్టు వద్ద అధికారులు నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. సాగునీటి విడుదలకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఈఈ ఆదేశించారు. రైతులు ఆశావహంగా ఎదురుచూస్తున్నారు.
Comments
Loading comments...