వార్తలకు తిరిగి వెళ్లండి
ఖైరతాబాద్లో హైడ్రా బాదితుల ఉద్రిక్తత

హైడ్రాను తక్షణమే రద్దు చేయాలంటూ, తమ ఇళ్లను కాపాడుకోవడానికి ఖైరతాబాద్లోని ఎంఎస్ మక్తా, బీఎస్ మక్తా బస్తీ ప్రజలు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చి శుక్రవారం భారీ ఆందోళన ర్యాలీ నిర్వహించారు.
నెక్లెస్ రోడ్డును ఆనుకొని ఉన్న తమ బస్తీలను హైడ్రా కూల్చివేస్తుందనే ప్రచారంతో భయాందోళనకు గురైన స్థానికులు, చేతుల్లో ప్లకార్డులు పట్టుకుని సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు.
Comments
Loading comments...