వార్తలకు తిరిగి వెళ్లండి

అధిక ఉష్ణోగ్రతలు, వర్షాభావ పరిస్థితులతో రాళ్లపాడు జలాశయంలో నీటిమట్టం 6.6 అడుగులకు పడిపోయింది. దీంతో కందుకూరు నియోజకవర్గంలోని 100కుపైగా గ్రామాలకు తాగునీరు అందించే పథకాలపై ప్రభావం పడే పరిస్థితి నెలకొంది.
జలాశయంలోని నీటి నాణ్యత తగ్గిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను కోరుతున్నారు.
Comments
Loading comments...

