వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్లో తాగునీటి దుర్వినియోగంపై వాటర్ బోర్డు కఠినంగా వ్యవహరిస్తోంది. వాహనాల కడగడం, గార్డెనింగ్ కోసం నీటిని వాడితే జరిమానాలతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరించారు.
పరిశ్రమలు శుద్ధి చేసిన నీటినే వాడాలని ఆదేశించారు. వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా ప్రజలందరూ నీటిని అత్యంత పొదుపుగా వాడుతూ, జలాశయాల స్థాయిని దృష్టిలో ఉంచుకుని బాధ్యతగా వ్యవహరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

