వార్తలకు తిరిగి వెళ్లండి
సినిమా చూస్తూ విషాదం

హైదరాబాద్ కూకట్పల్లిలో సినిమా చూస్తున్న ఓ కార్మికుడు గుండెనొప్పితో మృతి చెందాడు. నిజామాబాద్కు చెందిన డొక్కా కృష్ణ(35) స్నేహితుడితో కలిసి అర్జున్ థియేటర్లో మార్నింగ్ షోకు వెళ్లగా ఈ ఘటన జరిగింది.
కూలీగా పనిచేస్తున్న కృష్ణ సినిమా మధ్యలో అస్వస్థతకు గురై కన్నుమూశాడు. ఘటనపై కేపీహెచ్బీ పోలీసులు వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...