వార్తలకు తిరిగి వెళ్లండి

కృష్ణాష్టమి వేడుకల సందర్భంగా విద్యుత్ ప్రమాదాల నివారణకు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని రేగొండ ఏఈ రమేశ్ సూచించారు.
వేడుకల కోసం ఇనుప పోల్స్ను పాతే సమయంలో సమీపంలోని విద్యుత్ తీగలను గమనించాలని హెచ్చరించారు. పోల్స్ తీగలకు తగిలితే ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉందని తెలిపారు. విద్యుత్ లైన్లకు సమీపంలో పోల్స్ పాతాల్సి వస్తే ముందుగా సిబ్బందికి సమాచారం ఇవ్వాలని సూచించారు.
Comments
Loading comments...

