వార్తలకు తిరిగి వెళ్లండి
తోపుదుర్తిపై ఎమ్మెల్యే రాజు హెచ్చరిక

వైకాపా మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి అసత్య ఆరోపణలతో తన పరువుకు భంగం కలిగించారని తెదేపా ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజు ధ్వజమెత్తారు. తన ప్రాణం ఉన్నంత వరకు రాజకీయంగా తోపుదుర్తిని వెంటాడుతానని ఆయన స్పష్టం చేశారు.
కులాన్ని కించపరిచేలా మాట్లాడిన ప్రకాశ్రెడ్డి సవాల్కు స్పందించకపోవడంతో రాజు మీడియా ముందుకు వచ్చారు. ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
Comments
Loading comments...