వార్తలకు తిరిగి వెళ్లండి
బోటులో ప్రమాదం.. మత్స్యకారులకు గాయాలు

కాకినాడ జిల్లా ఎల్లయ్యపేట సముద్రంలో బోటులో వంట చేస్తుండగా గ్యాస్ లీకై అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బోటులో ఉన్న నలుగురు మత్స్యకారులు సముద్రంలోకి దూకి ప్రాణాలు కాపాడుకోగా, వెనుక వచ్చిన మరో బోటు సహాయంతో ఒడ్డుకు చేరారు.
ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలవ్వగా చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో బాధితుల వద్ద ఉన్న ఫోన్లు సైతం పూర్తిగా కాలిపోయాయి.
Comments
Loading comments...