వార్తలకు తిరిగి వెళ్లండి

వరంగల్ జిల్లాకు సంబంధించి 6,78,540 మంది ఓటర్లతో కూడిన ముసాయిదా జాబితాను సోమవారం ప్రకటించినట్లు కలెక్టర్ సత్యశారద తెలిపారు. ఇందులో 3,31,438 మంది పురుషులు, 3,47,018 మంది మహిళలు, 84 మంది ఇతర ఓటర్లు ఉన్నారు.
ముసాయిదా జాబితాపై దావాలు, అభ్యంతరాలను ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 వరకు స్వీకరించనున్నట్లు తెలిపారు. ఓటర్లు తమ వివరాలను పరిశీలించుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

