Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వరంగల్‌కు మరో 100 ఎలక్ట్రిక్‌ బస్సులు

Follow Udayam Digital on Google
రాజిత దేవి Aug 05, 2026 10:59 AM వరంగల్తెలంగాణ
వరంగల్‌కు మరో 100 ఎలక్ట్రిక్‌ బస్సులు - Udayam Digital
వరంగల్‌ నగర రవాణా సేవలను మెరుగుపరిచేందుకు పీఎం ఈ బస్‌ సేవా పథకం కింద మరో 100 ఎలక్ట్రిక్‌ బస్సులు త్వరలో అందుబాటులోకి రానున్నాయని టీజీఎస్‌ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి తెలిపారు. ప్రస్తుతం రీజియన్‌లో 112 ఎలక్ట్రిక్‌ బస్సులు నడుస్తున్నాయని చెప్పారు. బస్టాండ్లు, డిపోల్లో సౌకర్యాలను పరిశీలించిన ఆయన పరిశుభ్రత, భద్రత, బస్సుల సమయపాలనపై అధికారులకు సూచనలు చేశారు.

Comments

G
Loading comments...