వార్తలకు తిరిగి వెళ్లండి
గృహాల బిల్లులకై ఎదురుచూపులు

గత తెదేపా ప్రభుత్వ హయాంలో మంజూరైన ఎన్టీఆర్ గ్రామీణ గృహాల లబ్ధిదారులు పెండింగ్ బిల్లుల కోసం ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్నారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బిల్లులు నిలిపివేయడంతో జిల్లాలో పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
అప్పట్లో జిల్లాకు 20,225 గృహాలు మంజూరు కాగా, నిధులు అందక చాలా మంది నిర్మాణాలు వివిధ దశల్లో నిలిపేశారు. కొందరు అప్పులు చేసి ఇళ్లు పూర్తి చేయగా, మరికొందరు బిల్లుల కోసం ఎదురుచూస్తున్నారు.
Comments
Loading comments...