Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒక్కరోజే రూ.96.98 కోట్ల విరాళాలు

నిహారిక రెడ్డి Jul 16, 2026 8:44 AM తిరుపతి 7 viewsabout 2 hours ago
ఒక్కరోజే రూ.96.98 కోట్ల విరాళాలు - Udayam Digital
దాతల ప్రత్యేక సదుపాయాల (ప్రివిలేజెస్) విధానంలో తితిదే మార్పులు తీసుకురానున్న నేపథ్యంలో, పాత విధానం లబ్ధి కోసం దాతలు ఒక్కసారిగా పోటెత్తారు. దీంతో మంగళవారం ఒక్కరోజే 2,460 మంది దాతల నుండి రికార్డు స్థాయిలో రూ.96.98 కోట్ల విరాళాలు సమకూరాయి. సామాన్య భక్తుల దర్శనాలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకే తితిదే దాతల సదుపాయాలను కొంతమేర తగ్గిస్తూ బుధవారం నుండి నూతన పాలసీని అమల్లోకి తెచ్చింది. పాత దాతలకు పాత పద్ధతిలోనే సదుపాయాలు కొనసాగుతాయని స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...