వార్తలకు తిరిగి వెళ్లండి
సాలూరు ఆర్టీసీ కాంప్లెక్స్ వర్షపు నీటితో నిండిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి కాంప్లెక్స్ ఆవరణలో పెద్దఎత్తున నీరు చేరింది.
చిన్నపాటి వర్షానికే కాంప్లెక్స్ చెరువును తలపిస్తోందని పలువురు ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు.నీటి నిల్వ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

