వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షాకాలంలో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు.
కరీంనగర్ మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. ఖాళీ స్థలాల్లో నీరు నిల్వ కాకుండా చూడాలని, డ్రైనేజీలు, నాలాలు, కల్వర్టుల్లో పూడిక తొలగించాలని ఆదేశించారు. దోమల నియంత్రణకు యాంటీ లార్వా మందుల పిచికారీ చేయాలన్నారు.
Comments
Loading comments...

