వార్తలకు తిరిగి వెళ్లండి
ఓటర్ల సవరణ పారదర్శకంగా ఉండాలి: సునీత

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియను ఎలాంటి పొరపాట్లు లేకుండా పారదర్శకంగా నిర్వహించాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి సూచించారు. మెదక్ జిల్లా శివ్వంపేట మండలం గోమారంలో జరిగిన ఎస్ఐఆర్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఓటర్ల జాబితా ప్రక్రియ నిర్వహణపై అధికారులతో, బీఎల్ఓలతో ఎమ్మెల్యే మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...