వార్తలకు తిరిగి వెళ్లండి
కాళేశ్వరంపై సీఎం రేవంత్ ఫైర్

కిలాడీ కమిటీ తమపై ఒత్తిడి తెచ్చి ప్రజల ముందు దోషులుగా నిలబెట్టాలని చూస్తోందని సీఎం రేవంత్రెడ్డి మండిపడ్డారు. తమకు ఆ కమిటీతో పని లేదని, ఎన్డీఎస్ఏ ఆదేశాల మేరకే పనిచేస్తామని శనివారం నాటి మీడియా సమావేశంలో స్పష్టం చేశారు.
కేసీఆర్తో తప్పుడు పనులు చేయించి కాంట్రాక్టర్ల వద్ద కోట్లు కొల్లగొట్టారని విమర్శించారు. లక్ష కోట్లు గోదావరిలో కొట్టుకుపోయాయని, కాళేశ్వరం కాస్తా కూలేశ్వరం ఎందుకు అయిందో చెప్పాలని రేవంత్రెడ్డి దుయ్యబట్టారు.
Comments
Loading comments...