వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్కు ఓటేసినందుకు ప్రజలు తీవ్రంగా పశ్చాత్తాపపడుతున్నారని మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి అన్నారు. నేలకొండపల్లి మండలంలో మాట్లాడుతూ, ప్రజాపాలనలో అధికారులు, పీఏల చుట్టూ తిరగాల్సి వస్తోందని ఆయన విమర్శించారు.
పార్టీలు మారితేనే పథకాలు ఇస్తామనడం అన్యాయమని మండిపడ్డారు. ప్రభుత్వం ప్రజలందరిదీ అని స్పష్టం చేస్తూ, కేసీఆర్ను విమర్శించే స్థాయి పొంగులేటికి లేదన్నారు.
Comments
Loading comments...

