Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటరు ధ్రువీకరణపై తహసీల్దార్ సమీక్ష

Follow Udayam on Google
పార్వతి దేవి Jun 27, 2026 2:46 PM విశాఖపట్నంGeneral
ఓటరు ధ్రువీకరణపై తహసీల్దార్ సమీక్ష - Udayam
డుంబ్రిగూడ తహసీల్దార్ శంకర రావు శనివారం ఓటరు జాబితా సవరణ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బిల్లాపుట్టు, పోతంగి పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఓటరు ధ్రువీకరణ పనులను ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా బీఎల్‌వోలకు కీలక సూచనలు చేశారు. ఇంటింటికీ తిరిగి నిబంధనల మేరకు ఓటర్ల వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని, ప్రక్రియను వేగవంతం చేయాలని ఆయన ఆదేశించారు.

Comments

G
Loading comments...