వార్తలకు తిరిగి వెళ్లండి

విశ్వ హిందూ పరిషత్ సారంగాపూర్ ప్రఖండ నూతన కార్యవర్గాన్ని బుధవారం ఎన్నుకున్నారు. జిల్లా, ఇందూర్ విభాగ్ నాయకుల ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల్లో ప్రఖండ అధ్యక్షుడిగా సత్యం, ఉపాధ్యక్షుడిగా దోడ భోజన్న, ప్రధాన కార్యదర్శిగా మండాజి అరుణ్చారిని ఎంపిక చేశారు.
భజరంగ్ దళ్తో పాటు వివిధ విభాగాలకు పలువురిని బాధ్యులుగా నియమించారు. సర్పంచ్ కూనేరు భూమన్న, ఉప సర్పంచ్ అయిర కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

