Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వినతులు త్వరితగతిన పరిష్కరించాలి

Follow Udayam on Google
K Anuradha Sep 07, 2026 11:07 PM శ్రీకాకుళంGeneral
వినతులు త్వరితగతిన పరిష్కరించాలి - Udayam
జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీసు పబ్లిక్ గ్రీవెన్స్‌లో అదనపు ఎస్పీ పి. శ్రీనివాసరావు ప్రజల నుంచి 58 ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి త్వరితగతిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. భూ, ఆస్తి వివాదాలు, కుటుంబ కలహాలు, వ్యక్తిగత విభేదాలకు సంబంధించిన ఫిర్యాదులు ఉన్నాయి.

Comments

G
Loading comments...