వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక చవితి వేడుకల్లో విద్యుత్ భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని పెద్దపల్లి సర్కిల్ ఎస్ఈ వి.గంగాధర్ తెలిపారు. మండపాలు, నిమజ్జన మార్గాల్లో విద్యుత్ లైన్లు, స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లను ముందుగా తనిఖీ చేయాలని సూచించారు.
నిర్వాహకులు భద్రతా ప్రమాణాలు పాటించాలని కోరారు. తెగిన తీగలు కనిపిస్తే తాకకుండా వెంటనే 1912కు సమాచారం ఇవ్వాలని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

