వార్తలకు తిరిగి వెళ్లండి

మెంటాడ మండలంలో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించే నిర్వాహకులు తప్పనిసరిగా పోలీసుల అనుమతులు తీసుకోవాలని ఎస్సై సీతారాం తెలిపారు. విగ్రహ ప్రతిష్ఠ, మండపాల ఏర్పాటు, ఊరేగింపులు తదితర కార్యక్రమాలకు ముందుగానే సంబంధిత శాఖల అనుమతులు పొందాలని సూచించారు.
ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిబంధనలు పాటించాలని కోరారు. ప్రశాంత వాతావరణంలో వేడుకలు నిర్వహించేలా నిర్వాహకులు సహకరించాలని సూచించారు.
Comments
Loading comments...

