వార్తలకు తిరిగి వెళ్లండి
గ్రామసభల నిర్వహణ నిధులు విడుదల

తాండూరు మండలంలోని గ్రామాల్లో గత నెలలో నిర్వహించిన గ్రామసభలకు సంబంధించి ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. ఒక్కో గ్రామపంచాయతీకి రూ.10 వేల చొప్పున ప్రత్యేకంగా కేటాయించింది.
మండలంలోని మొత్తం 33 పంచాయతీలకు సంబంధించి రూ.3.30 లక్షల నిధులను ఆయా గ్రామపంచాయతీ ఖాతాల్లో జమ చేసినట్లు ఎంపీడీవో అధికారులు తెలిపారు. నిధులు రావడంతో గ్రామాల్లో అభివృద్ధి పనులు మరింత వేగవంతం కానున్నాయి.
Comments
Loading comments...