వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లావ్యాప్తంగా నకిలీ డీఏపీ విక్రయాలు రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. టన్నుల కొద్ది నకిలీ ఎరువులు అంటగట్టి అక్రమార్కులు లక్షలు కొల్లగొట్టారు. పరిగి, చన్గోముల్, బంట్వారం సహా పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.
పోలీసులు, వ్యవసాయ అధికారులు నామమాత్రపు విచారణతో చేతులు దులుపుకుంటున్నారని, రాజకీయ ఒత్తిళ్లతో కీలక నిందితులను తప్పిస్తున్నారని రైతాంగం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది.
Comments
Loading comments...

