వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లాలో సోమవారం రాత్రి దారుణ హత్య జరిగింది. బొండపల్లి మండలం కనిమెరక ఎస్సీ కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో బుంగ రామ ముత్యాలు తన భార్య సంధ్యను హతమార్చినట్లు సమాచారం.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
Comments
Loading comments...

