వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల పద్మశాలి మహిళల ఆధ్వర్యంలో ఆదివారం విజ్ఞాన, ఆధ్యాత్మిక విహారయాత్ర నిర్వహించారు. సుమారు 50 మంది మహిళలు పాల్గొని కాలభైరవ, చాముండేశ్వరి, ఏడుపాయల దుర్గమ్మ ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మహిళల్లో ఆత్మీయత, ఐక్యత పెంపొందడంతో పాటు ఆధ్యాత్మిక, సాంస్కృతిక అవగాహన పెరిగిందని నిర్వాహకులు తెలిపారు. ఇందులో సింగం పద్మ, భీమనాతి ఉమారాణి, పద్మావతి, శోభారాణి, మనోహర, లత, శైలజ పాల్గొన్నారు.
Comments
Loading comments...

