Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బ్యాంక్‌ పేరుతో ఫోన్‌.. రూ.3.44 లక్షల మోసం

Follow Udayam on Google
Anuroop Sep 03, 2026 6:04 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
బ్యాంక్‌ పేరుతో ఫోన్‌.. రూ.3.44 లక్షల మోసం - Udayam
క్రెడిట్‌ కార్డు ఇన్సూరెన్స్‌ తొలగిస్తామంటూ సైబర్‌ నేరగాళ్లు పటమటలంకకు చెందిన శివకుమార్‌ ఖాతా నుంచి రూ.3.44 లక్షలు కాజేశారు. గత నెల 24న ఇండస్‌ఇండ్‌ బ్యాంకు ప్రతినిధులమంటూ ఫోన్‌ చేసి, ఓ లింక్‌ను పంపించారు. లింక్‌ను క్లిక్‌ చేయగానే శివకుమార్‌ ఫోన్‌ హ్యాంగ్‌ అయ్యింది. అనంతరం నగదు డ్రా అయినట్లు గుర్తించి పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదైంది. అనవసర లింకులను క్లిక్‌ చేయవద్దని పోలీసులు హెచ్చరించారు.

Comments

G
Loading comments...