వార్తలకు తిరిగి వెళ్లండి

వీధి కుక్కల దాడిలో ఒక వృద్ధుడు మృతి చెందిన సంఘటన దండేపల్లి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. దండేపల్లికి చెందిన ఓరుగంటి పోశం (80) వృద్ధాప్యం, అనారోగ్యం కారణం వల్ల నడవలేని స్థితిలో మంచానికే పరిమితమయ్యారు.
గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఐదు వీధి కుక్కలు ఆయనపై దాడి చేసి తీవ్రంగా కొరకడంతో అక్కడికక్కడే మృతి చెందాడని స్థానికులు తెలిపారు. దండేపల్లిలో వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉందని వారు వాపోయారు.
Comments
Loading comments...

