Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ షాక్‌తో ఒకరు మృతి

Follow Udayam on Google
RAGHU Aug 25, 2026 8:37 PM శ్రీకాకుళంGeneral
విద్యుత్ షాక్‌తో ఒకరు మృతి - Udayam
నరసన్నపేట మండలం మడపాం గ్రామంలో వెల్డింగ్ పనులు చేస్తుండగా విద్యుత్ షాక్‌తో ఒకరు మృతి చెందారు. మండలంలోని చేనులవలసకు చెందిన సరిపల్లి రామచంద్రరావు (35) మడపాంలోని ఒక కంపెనీలో వెల్డింగ్ పనులు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. అతడిని ఏరియా హాస్పిటల్‌కు తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...