వార్తలకు తిరిగి వెళ్లండి

రాజుపాలెం మండలం అనుపాలెం ప్రభుత్వ పాఠశాలలో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. వైద్యాధికారి డాక్టర్ ఆర్.శ్రీనివాస్ విద్యార్థులకు సీజనల్ వ్యాధులు, వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.
అనంతరం విద్యార్థులకు వైద్య పరీక్షలు చేసి ఆయుష్ మందులను ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

