Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థుల సామర్ధ్యాలపై ఎంఈఓ పరిశీలన

Follow Udayam on Google
K Anuradha Aug 24, 2026 2:51 PM శ్రీకాకుళంGeneral
విద్యార్థుల సామర్ధ్యాలపై ఎంఈఓ పరిశీలన - Udayam
నరసన్నపేట(M) ఉర్లాం ప్రాథమిక పాఠశాలను ఎంఈఓ పేడాడ దాలినాయుడు సోమవారం సందర్శించారు. విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించి, వారి అభ్యసన స్థాయిని ఎప్పటికప్పుడు గమనించాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి సామర్థ్యాలను పరిశీలించారు. ప్రతిరోజూ హోంవర్క్‌ తప్పనిసరిగా ఇవ్వడంతో పాటు, వాటిని విద్యార్థులు పూర్తి చేస్తున్నారా లేదా అనే విషయాన్ని పరిశీలించాలని ఉపాధ్యాయులకు సూచించారు.

Comments

G
Loading comments...