వార్తలకు తిరిగి వెళ్లండి

పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం అనసభద్ర ఏకలవ్య పాఠశాల ప్రిన్సిపల్ సురేశ్ను సస్పెండ్ చేస్తూ గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి నాయక్ ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న గిరిజన విద్యార్థి అర్పిత్ (12) గురువారం హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకున్న ఘటన నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టారు.
అలాగే వార్డెన్ను విధుల నుంచి తొలగించారు. విద్యార్థి మృతిపై తండ్రి రాంబాబు అనుమానం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

