వార్తలకు తిరిగి వెళ్లండి
వైస్అడ్మిరల్ శ్రీనివాస్కు ‘అతి విశిష్ట సేవాపతకం’

కృష్ణాజిల్లాకు చెందిన వైస్ అడ్మిరల్ శ్రీనివాస్ కుదరవల్లి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతులమీదుగా ‘అతి విశిష్ట సేవామెడల్’ అందుకున్నారు. 1990లో భారత నౌకాదళంలో చేరిన ఆయన విశాఖ నేవల్ డాక్యార్డులో కీలక బాధ్యతలు నిర్వహించారు.
‘ఐఎన్ఎస్ విరాట్’, ‘ఐఎన్ఎస్ విక్రమాదిత్య’ నౌకల పునరుద్ధరణ పనుల్లో శ్రీనివాస్ సమర్థంగా పనిచేశారు. దేశ రక్షణ రంగానికి ఆయన చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఈ అత్యున్నత పురస్కారం లభించింది.
Comments
Loading comments...