వార్తలకు తిరిగి వెళ్లండి
పింఛన్ల పంపిణీలో ఏపీ దేశానికే ఆదర్శం: మంత్రి వాసంశెట్టి

అవనిగడ్డలో మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. జూలై నెలకు గానూ 62.19 లక్షల మందికి రూ.2,711 కోట్లను ప్రభుత్వం విడుదల చేసిందని, 1వ తేదీనే పింఛన్లు అందిస్తున్నామని మంత్రి తెలిపారు.
కూటమి ప్రభుత్వం రూ.4 వేల సామాజిక పింఛన్ ఇస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. గత ప్రభుత్వం పింఛన్ల విషయంలో మాట తప్పిందని, ప్రస్తుత ప్రభుత్వం నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందని విమర్శించారు.
Comments
Loading comments...