Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెంగ్వాపేట్‌లో ధాన్యాల నిల్వ గోదాంకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

సందీప్ Jul 08, 2026 10:06 AM నిర్మల్ 10 viewsabout 1 hour ago
వెంగ్వాపేట్‌లో ధాన్యాల నిల్వ గోదాంకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే - Udayam Digital
నిర్మల్ రూరల్ మండలం వెంగ్వాపేట్ గ్రామంలో రూ.30 లక్షల వ్యయంతో నిర్మించనున్న ఆహార ధాన్యాల నిల్వ గోదాంకు ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి బుధవారం శంకుస్థాపన చేశారు. రైతులు పండించిన ధాన్యాన్ని సురక్షితంగా దాచుకోవడానికి గోదాములు ఎంతో అవసరమని, గ్రామీణ మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ఆయన పేర్కొన్నారు. అనంతరం గ్రామంలోని పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలతో, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, బీజేపీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...